Atchannaidu: జగన్‌ను మించిన నియంతలా పెద్దారెడ్డి: అచ్చెన్నాయుడు

తాడిపత్రిలో తమ పార్టీ కౌన్సిలర్ విజయ్ కుమార్‌పై వైకాపా గూండాల దాడి హేయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Published : 27 Sep 2022 12:53 IST

అమరావతి: తాడిపత్రిలో తమ పార్టీ కౌన్సిలర్ విజయ్ కుమార్‌పై వైకాపా గూండాల దాడి హేయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విజయ్‌కుమార్‌పై వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారని.. రెండు రోజుల క్రితం మరో కౌన్సిలర్‌ మల్లికార్జున పైనా దాడి చేశారని ఆరోపంచారు. దళితులపై సీఎం జగన్‌ కక్ష కట్టారని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ‘వైఎస్సార్‌ దళితులపై దాడులు కానుక’ పథకం అమలవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోతోందని.. జగన్‌ను మించిన నియంతలా ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. తెదేపా కౌన్సిలర్లపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని అచ్చెన్న డిమాండ్‌ చేశారు.

తాడిపత్రి పీఎస్‌ ఎదుట జేసీ ప్రభాకర్‌రెడ్డి బైఠాయింపు

తెదేపా కౌన్సిలర్లపై దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆందోళనకు దిగారు. తాడిపత్రి పీఎస్‌ ఎదుట ఆయన భైఠాయించారు. తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జేసీ బైఠాయింపు నేపథ్యంలో ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని