Atchannaidu: అబద్ధపు హామీలతో జగన్‌ అధికారంలోకి: అచ్చెన్న

గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలవడంతో జగన్‌మోహన్‌రెడ్డి కళ్లు మూసుకు పోయాయని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Published : 22 May 2023 22:25 IST

అమరావతి: పాదయాత్ర చేసి అబద్ధపు హామీలతో సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 151 సీట్లు గెలవడంతో జగన్‌ కళ్లు మూసుకు పోయాయని అన్నారు. తెదేపా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే.. ఈ ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. విశాఖ రాజధాని పేరుతో రూ.30 వేల కోట్ల విలువైన భూములను వైకాపా నేతలు ఆక్రమించుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని