ప్రభుత్వాన్ని సంప్రదించాకే ప్రైవేటీకరణ: అచ్చెన్న

ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాల..

Published : 10 Mar 2021 01:41 IST

విశాఖ: ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయోజనాల కోసం సీఎం వెంట ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే విశాఖ ఉక్కుపై ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించారా? ఏనాడైనా దిల్లీ వెళ్లి మాట్లాడారా? ఇప్పుడు అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్తానంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. 23 మంది ఎంపీలు ఉన్నా మాట్లాడేందుకు ప్రధాని సమయం ఇవ్వరా? అని నిలదీశారు.

సీఎం జగన్‌కు స్టీల్‌ ప్లాంట్‌ భూములపై ఉన్న ఆశ త్యాగాలపై లేదని.. ఆయన చెప్పే ప్రతి మాటా అబద్ధమేనన్నారు. జగన్‌ రాసే లేఖలు దిల్లీలో పట్టించుకునే వారు ఎవరూ లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ చేపట్టినట్లు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 2003లోనే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు యత్నించారని.. అప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో ఎర్రన్నాయుడు పోరాడి ఆపారని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని