Andhra News: వారి నుంచి ప్రాణహాని ఉంది.. నా భద్రత పెంచండి: డీజీపీకి అచ్చెన్న లేఖ

తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహశక్తులు, నేరస్థులతో తనకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు కల్పిస్తున్న...

Published : 11 May 2022 02:05 IST

అమరావతి: తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డీజీపీకి లేఖ రాశారు. సంఘ విద్రోహశక్తులు, నేరస్థులతో తనకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా,  శాసనసభాపక్ష ఉపనేతగానూ వ్యవహరిస్తున్నందున తాను కోరిన అదనపు భద్రత కల్పించాలని డీజీపీని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని