తనిఖీలు చేయిద్దాం.. మద్యంలో ఎలాంటి రసాయనాలున్నాయో తెలుస్తుంది: అచ్చెన్నాయుడు
నాటుసారా మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై చట్టసభలో చర్చించాలని అడిగినందుకే తమను సస్పెండ్ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఉంగుటూరు: నాటుసారా మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఈ అంశంపై చట్టసభలో చర్చించాలని అడిగినందుకే తమను సస్పెండ్ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సభలో తెదేపా ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందునే బయటకు వచ్చి చెబుతున్నామని వెల్లడించారు. నాటుసారా తాగి 27 మంది చనిపోయారని వారి కుటుంబసభ్యులే చెప్పారన్నారు. ఉంగుటూరులో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
‘‘నాటుసారా మరణాలను సహజ మరణాలని ఇవాళ కూడా సభలో సీఎం చెప్పారు. అంతటితో ఆగకుండా ప్రస్తుత బ్రాండ్లు అన్నీ తెదేపా అధినేత చంద్రబాబు తెచ్చారని అబద్ధాలు చెప్పారు. మా హయాంలో అసలు మద్యం బ్రాండ్ల గురించి ఎవరైనా ప్రశ్నించారా?అసలు మద్యం పాలసీని ఎందుకు మార్చారని సీఎంను ప్రశ్నిస్తున్నాం. మద్యం విధానాన్ని మార్చి.. దుకాణాలు తీసుకోవడం వల్లే సమస్య వచ్చింది. నచ్చిన బ్రాండ్ కొనుక్కొనే స్వేచ్ఛ వినియోగదారుడికి గతంలో ఉండేది. ఇవాళ రేటు చెప్పి మద్యం అడగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. మద్యం కొనుక్కోలేకే నాటుసారా తాగారని అందరికీ తెలుసు. ప్రతి మద్యం దుకాణంలో 10 సీసాలు తీసుకొని తనిఖీలు చేయిద్దాం. వాటిలో ఎంత మేర హానికరమైన రసాయనాలు ఉన్నాయో తెలుస్తుంది. మద్యం బ్రాండ్లు, తయారీ కంపెనీలపై మరిన్ని వివరాలు చెబుతాం.
దశలవారీగా మద్యపాన నిషేధం అని ఎన్నికల ముందు జగన్ చెప్పలేదా?వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్యంపైనే ఎక్కువ ఆదాయం వస్తోంది. మద్యంపై ఆదాయం రూ.6వేల కోట్ల నుంచి రూ.16,500 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. వినియోగం తగ్గితే దాని ద్వారా వచ్చే ఆదాయం ఎలా పెరుగుతుంది? ఈ విషయాలను ప్రజలు ఒకసారి గమనించాలి. బ్రాండ్లపై మేం మాట్లాడకుండా చేశారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. నాటుసారా మరణాలపై జ్యుడిషియల్ విచారణ వేసేందుకు ఎందుకు భయం వేస్తోంది. మరణాలపై ఎక్సైజ్ శాఖ కమిషనర్కు వినతిపత్రం ఇవ్వకూడదా? కమిషనర్ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా అరెస్టులు చేస్తారా?అరెస్టులు చేసినా, జైలులో పెట్టినా మా ఆందోళన ఆగదు. జె బ్రాండ్ మద్యం పూర్తిగా ఆగేవరకు పోరాటం చేస్తాం’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు