సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారు

ఏపీ సీఎం జగన్‌ నిర్లక్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

Published : 25 Apr 2021 01:59 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ నిర్లక్యం వల్లే రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే కేసులు పది లక్షలు దాటాయన్నారు. ప్రపంచమంతా కరోనా కట్టడికి పోరాడుతుంటే సీఎం మాత్రం రాజకీయ పోరులో బిజీగా ఉన్నారని విమర్శించారు. కొవిడ్‌ పరీక్ష మొదలు చికిత్స వరకు బాధితులు పడిగాపులు కాస్తుంటే.. తూతూ మంత్రంగా సమీక్షలతో చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకూ ఆక్సిజన్‌ కొరత తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పడకలు దొరక్క కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ ఆస్పత్రులను పెంచకుండా, క్వారంటైన్ కేంద్రాలను పట్టించుకోకుండా సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసలుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని