దొంగ ఓట్లపై వైకాపాకు అచ్చెన్న సవాల్‌

వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని

Updated : 20 Apr 2021 10:23 IST

వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలన్న తెదేపా

అమరావతి: వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో వైకాపా దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అని వైకాపాకు సవాల్‌ విసిరారు. ‘‘ దొంగ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని వైకాపా నేతలు వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తారా?దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలి. తిరుపతి ఉప ఎన్నికలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు పడ్డాయి’’ అని అచ్చెన్న అన్నారు. 

తిరుపతి లోక్‌సభ స్థానానికి ఈ నెల 17న జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించిందని తెదేపా తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనిపై స్పందించిన వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలవి తప్పడు ఆరోపణలు అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని