నిరసన తర్వాతే ప్రభుత్వం స్పందించింది

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపాకే పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని

Updated : 02 Dec 2020 01:57 IST

తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపాకే పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ వద్ద మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. పంటల బీమా కట్టలేదని ప్రభుత్వాన్ని తాము నిలదీస్తే కట్టామంటూ సభలో ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు. ఇప్పుడు బీమా ప్రీమియం చెల్లింపులకు నిధులు విడుదల చేస్తే లాభం ఏమిటని ప్రశ్నించారు. 

పంట నష్టపోయాక, రైతులు చనిపోయాక పరిహారం చెల్లిస్తే లాభమేమిటని ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రభుత్వం ఏవిధంగా రైతుల్ని మోసం చేసిందో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. చంద్రబాబుని ఉద్దేశించి వైకాపా మంత్రులు ఏకవచనంతో మాట్లాడటం సబబేనా అని మండిపడ్డారు. ఈ తరహా అవాకులు చవాకులు మానుకోకుంటే జగన్‌ను ఉద్దేశించి ప్రతి తెదేపా కార్యకర్త గట్టిగా స్పందించాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని