‘రఘురామకు ఏం జరిగినా సీఎందే బాధ్యత’

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును జైలుకు తరలించారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.రఘురామకు ఏం జరిగినా సీఎం, సీఐడీ అధికారులే...

Published : 17 May 2021 01:29 IST

అమరావతి: కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును జైలుకు తరలించారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రఘురామకు ఏం జరిగినా సీఎం, సీఐడీ అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. సీఎం జగన్‌ కనుసన్నల్లోనే మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన చెందుతున్నారని, కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై సీఐడీ పోలీసులు రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని