Andhra News: వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు మంగమూరు సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది వైశ్యులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ అనుమతి కోసం వైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించారంటూ మేయర్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.