Andhra News: వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత

Updated : 17 Mar 2022 15:03 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించారంటూ ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు మంగమూరు సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది వైశ్యులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్‌ అనుమతి కోసం వైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి సుబ్బారావు గుప్తా మేయర్‌ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించారంటూ మేయర్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని