Amaravati: బరి తెగించిన వైకాపా శ్రేణులు.. అమరావతిలో భాజపా నేతలపై దాడి
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆపార్టీ నేతలపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం వద్ద ఈఘటన జరిగింది.
అమరావతి: అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో వైకాపా కార్యకర్తలు బరితెగించారు. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో జరిగిన సభలో పాల్గొని తిరిగి విజయవాడ వెళ్తున్న సమయంలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఆపార్టీ నేతలపై దాడికి పాల్పడ్డారు. భాజపా నేతల వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రాగానే అక్కడ ఉన్న 3 రాజధానుల శిబిరం నుంచి వైకాపా నేతలు దూసుకొచ్చారు. వాహనాలకు అడ్డంగా నిలబడి 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. కొందరు భాజపా నేతలు కారు దిగి వారిని అడ్డు తొలగాలని చెప్పారు. దీంతో భాజపా నేతలపై వైకాపా శ్రేణులు ఒక్క సారిగా దాడికి దిగారు. ఒక్కొక్కరిని వెంటపడి తరిమికొట్టారు. సత్య కుమార్ ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అప్రమత్తమైన పోలీసులు సత్యకుమార్ను అక్కడి నుంచి పంపించారు. పోలీసుల సాయంతో భాజపా నేతలు అక్కడి నుంచి బయటపడ్డారు. సత్యకుమార్ వాహనంపై దాడి ఘటనకు సంబంధించి తుళ్లూరు పోలీసులకు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. భాజపా నేతలు సత్యకుమార్, ఆదినారాయణరెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బీజేవైఎం నేత పనతల సురేష్ తెలిపారు.
తాటాకు చప్పుళ్లకు భయపడం: సత్యకుమార్
దాడి ఘటన తర్వాత విజయవాడలోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యకుమార్ మాట్లాడారు. వైకాపా తాటాకు చప్పుళ్లకు భయపడబోమని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలపై దాడి చేస్తే తిరిగి దాడి చేయుడం కూడా తెలుసని.. కానీ, ప్రజాస్వామ్యంపై గౌరవంతో ప్రతిదాడులు చేయడం లేదన్నారు. దాడి వెనుక సూత్రధారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి ఘటనను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. భాజపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారని ఆరోపించారు. మందడంలో వేలాది మంది రైతులు దీక్ష చేస్తుంటే 10 మంది పోలీసులు కూడా లేరని, 3 రాజధానులకు మద్దతుగా 10మంది దీక్ష చేస్తుంటే వంద మంది పోలీసులు ఎందుకున్నారని ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు.. పథకం ప్రకారమే ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారని సత్య కుమార్ ఆరోపించారు. సీఎం జగన్ సారథ్యంలోనే ఇదంతా జరిగిందన్నారు.
3 రాజధానుల శిబిరం వద్ద ఎంపీ సురేష్ హల్ చల్
భాజపా నేతలపై దాడి ఘటనపై వైకాపా ఎంపీ నందిగం సురేష్ ఎదురుదాడికి దిగారు. భాజపా నేతలే 3 రాజధానుల శిబిరంపై దాడి చేశారని ఆరోపించారు. దాడి ఘటన తర్వాత మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ సురేష్ కాసేపు హడావుడి చేశారు. ధైర్యం ఉంటే భాజపా నేతలు ఇప్పుడు రావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. భాజపా నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పక్కా ప్రణాళికతోనే దాడి జరిగింది: చంద్రబాబు
భాజపా నేత సత్యకుమార్ వాహనంపై వైకాపా గూండాల దాడిని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైకాపా మూకలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. దాడి చేసే వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.