అకాలీదళ్ చీఫ్ బాదల్ కాన్వాయ్పై రాళ్ల దాడి!
పంజాబ్లోని జలాలబాద్లో శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సుఖ్బీర్ సింగ్ బాదల్ తమ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా..
ఛండీగఢ్: పంజాబ్లోని జలాలబాద్లో శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ వాహనంపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సుఖ్బీర్ సింగ్ బాదల్ తమ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా.. ఆయన కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు. వెంటనే బాదల్ను రక్షించేందుకు అకాలీదళ్ నేతలు సైతం రంగంలోకి దిగే సరికి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఈ దాడికి అధికార కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపిస్తూ అకాలీదళ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్పై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి దిగారు. ఈ క్రమంలో కార్యకర్తలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాదల్ను దాడి నుంచి రక్షించారు. ఈ ఘర్షణలో కొందరు మా పార్టీ కార్యకర్తలపై తుపాకీ కాల్పులు కూడా జరిపారు. బాదల్ రక్షించడానికి వెళ్లిన మా కార్యకర్తల్లో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. బాదల్కు ఎలాంటి హాని జరగలేదు’ అని అకాలీదళ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిందర్ సింగ్ అల్వా కుమారుడి నేతృత్వంలోనే అకాలీనేతలపై ఈ దాడులు జరిగినట్లు బాదల్ మీడియా సలహాదారుడు జంగ్వీర్ సింగ్ ఆరోపించారు. బాదల్ వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసినట్లు చెప్పారు. తుపాకీతో కాల్పులు కూడా జరపగా.. ఇందులో ముగ్గురు అకాలీ కార్యకర్తలు గాయాల పాలయ్యారని వెల్లడించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. కాగా.. పంజాబ్లో ఫిబ్రవరి 14వ తేదీన 8 మున్సిపల్ కార్పొరేషన్లకు, 109 మున్సిపల్ కౌన్సిళ్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి
నా భర్త చదివిన పాఠశాల ఫొటో తీయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా