Ayyanna patrudu: నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం.. విజయసాయిరెడ్డికి అయ్యన్న సవాల్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ మున్సిపల్
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ మున్సిపల్ అధికారులు అయ్యన్న ఇంటి ప్రహరీని ధ్వంసం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ అయ్యన్న అనుచరులు, తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో నర్సీపట్నంలో పోలీసులు మోహరించారు. గోడ కూల్చొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. దీనికి తోడు ఇటీవల చోడవరంలో జరిగిన మినీ మహానాడులో ప్రభుత్వంపై విమర్శలు చేశారని అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు గురువారం విశాఖ పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు. 6 రోజుల క్రితం గుంటూరు పోలీసులు కూడా నోటీసు సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చేందుకు వచ్చారు. అయ్యన్న అందుబాటులో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఈ నేపథ్యంలో ఇవాళ అయ్యన్నపాత్రుడు చేసిన ఓ ట్వీట్ చర్చనీయంశంగా మారింది. ‘‘నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉంది. జేసీబీలు, ఐపీఎస్లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు. అంత భయం ఎందుకు విజయసాయిరెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం’’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ