Balakrishna: దేనికైనా సిద్ధం.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: బాలకృష్ణ

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం

Updated : 04 Feb 2022 14:18 IST

హిందూపురం: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ బాలకృష్ణ మౌనదీక్షకు నిర్ణయించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీపొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.

ఉద్యోగుల ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే రాత్రికి రాత్రి జిల్లాలను ప్రకటించారని ఆయన ఆరోపించారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికని చెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. అన్ని వసతులున్న హిందూపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని