Balakrishna: దేనికైనా సిద్ధం.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా: బాలకృష్ణ
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం
హిందూపురం: హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాల్సిందేనని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బాలకృష్ణ మౌనదీక్షకు నిర్ణయించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీపొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
ఉద్యోగుల ఆందోళనల నుంచి దృష్టి మళ్లించేందుకే రాత్రికి రాత్రి జిల్లాలను ప్రకటించారని ఆయన ఆరోపించారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేదే తన కోరికని చెప్పారు. హిందూపురం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. అన్ని వసతులున్న హిందూపురాన్నే జిల్లా కేంద్రంగా ప్రకటించాని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.