Andhra news: హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష !

ఏపీ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మౌనదీక్ష

Updated : 03 Feb 2022 16:30 IST

అనంతపురం: ఏపీ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం మౌనదీక్ష చేయనున్నారు. దీక్ష కోసం ఆయన ఇప్పటికే హిందూపురం చేరుకున్నారు. హిందూపురంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం అఖిలపక్షాల నేతలతో ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని