Bandi sanjay: మా కార్పొరేటర్లను భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారు: బండి సంజయ్‌

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. శంషాబాద్‌

Published : 01 Jul 2022 16:18 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెరాస ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నికలను గల్లీస్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. కేసీఆర్‌ భాజపా ఫ్లెక్సీలను అడ్డుకున్నంత మాత్రాన తమను అడ్డుకోలేరని అన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భయపడే తమపార్టీ కార్పొరేటర్లను తెరాసలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. డబ్బుతో ప్రలోభపెట్టి, కేసులతో భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారని విమర్శించారు. 

భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మాట్లాడుతూ... కేసీఆర్‌ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలే బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.  కేసీఆర్‌కు ఇక్కడే  దిక్కులేదు.. జాతీయ స్థాయిలో ఏం చేస్తారని ప్రశ్నించారు. భాజపా సమావేశాలతో తెరాస నేతలకు వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని