Bandi Sanjay: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని మోదీ నెరవేర్చారు: బండి సంజయ్
జమ్మూకశ్మీర్ భారత్లో భాగమని ఆనాడే పోరాడిన వ్యక్తి డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..
హైదరాబాద్: జమ్మూకశ్మీర్ భారత్లో భాగమని ఆనాడే పోరాడిన వ్యక్తి డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని మైనారిటీ సంతుష్ఠీకరణ నచ్చకే ఆయన బయటకు వచ్చారని చెప్పారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ సహా పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భాజపా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని నెరవేర్చారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం