BJP: సీఎం కుమార్తె వాచ్కు ఉన్న విలువ వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదు: బండి సంజయ్
వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపించడానికి సీఎంకు అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరవైందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) విమర్శించారు. భారాస (BRS) పాలనలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. సంజయ్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
అంతకు ముందు బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుమార్తె చేతికి ఉన్న వాచ్ విలువ వైద్య విద్యార్థి ప్రాణానికి లేదని విమర్శించారు. సీఎం కుమార్తె చేతికి రూ.25 లక్షల విలువైన వాచ్ను వాడుతున్నారని.. వైద్య విద్యార్థిని ప్రీతి మరణిస్తే రూ. 10లక్షలు ఆర్థిక సాయం మాత్రమే అందజేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. శవానికి ట్రీట్మెంట్ చేస్తూ సినిమా చూపించారన్నారు. ప్రీతి సెల్ఫోన్లోని డేటా మొత్తం డిలీట్ చేశారన్న సంజయ్.. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు. ప్రీతిని తమ కుటుంబసభ్యులు చివరి చూపు చూసుకోకుండా ఆదరా బాదరాగా అంత్యక్రియలు చేశారన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి సీఎం కేసీఆర్కు అభ్యంతరమేంటి? అని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తాం..
అనంతరం బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దిల్లీ లిక్కర్ స్కామ్లో సిసోదియా అరెస్టును ఖండిస్తూ ఆదివారం నలుగురు సీఎంలు, విపక్షనేతలు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై ఆయన స్పందిస్తూ.. కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. సంతకాల్లేకుండా ప్రధానికి లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ‘‘దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తెను అరెస్టు చేస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారు. కుమార్తెపై ఆరోపణలోస్తే స్పందించకుండా సిసోదియా అరెస్ట్ను ఖండించడం వెనుకనున్న మతలబు ఇదే. సీఎంగా ఉంటూ ఇంత నీచ స్థాయికి దిగజారడం అవసరమా? ప్రధాని మోదీని బదనాం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. నువ్వు మందితో కలిసి లేఖ రాస్తే.. నీ అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తాం. త్వరలోనే రాష్ట్రపతిని కలిసే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!