Telangana News: సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత: బండి సంజయ్‌

సికింద్రాబాద్‌ అల్లర్ల వెనుక తెలంగాణ ప్రభుత్వ హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు

Published : 18 Jun 2022 15:21 IST

కరీంనగర్: సికింద్రాబాద్‌ అల్లర్ల వెనుక తెలంగాణ ప్రభుత్వ హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారన్నారు. అల్లర్లు జరుగుతాయని తెలిసే పోలీసులు అలసత్వం వహించారని చెప్పారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జ్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రైల్వే స్టేషన్‌లోకి పెట్రోల్‌ ఎలా వచ్చింది? కేంద్రంపై బురదజల్లేందుకే తెరాస గూండాలు దాడి చేశారు. సికింద్రాబాద్‌లో జరిగిన నష్టానికి కేసీఆర్‌దే పూర్తి బాధ్యత’’ అని బండి సంజయ్‌ అన్నారు. మరోవైపు అగ్నిపథ్ గొప్ప స్కీమ్‌ అని.. ఆర్మీ అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సంజయ్‌ వారికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని