Bandi Sanjay: పాలమూరుకు రండి.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం: కేసీఆర్కు సంజయ్ లేఖ
తెలంగాణ సీఎం కేసీఆర్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటిస్తున్నాను.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘పాలమూరు ప్రజల పట్ల వివక్ష చూపుతున్నారు. తెరాస సర్కారు వల్ల పాలమూరు ప్రాజెక్టులు పూర్తికాలేదు. పాలమూరును పచ్చగా చేస్తానన్న వాగ్ధానాలేవీ అమలు కాలేదు. ఇక్కడి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల సాగునీటి కష్టాల్ని తీర్చాలనే శ్రద్ధ ప్రభుత్వంలో కనిపించడం లేదు. పాలమూరుకు రండి.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు సిద్ధం.. చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
పాలమూరులో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయండి. వలసల నివారణకు చర్యలు చేపట్టండి. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కలేదు. గడిచిన ఏనిమిదేళ్లలో తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు’’ అని సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అంతకముందు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన ఉమ్మడి మహబూబ్నగర్లో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తక్కశిల చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా