అందుకే కొత్త రాజ్యాంగం కావాలంటున్నారా?: సీఎం కేసీఆర్కు బండి సంజయ్ ప్రశ్న
దేశాన్ని బాగు చేసేందుకు కొత్త రాజ్యాంగం అవసరం ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ దిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి.......
తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు పాదయాత్ర
దిల్లీ: దేశాన్ని బాగు చేసేందుకు కొత్త రాజ్యాంగం అవసరం ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని నిరసిస్తూ దిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. భాజపా భీమ్ పేరుతో నిర్వహించిన ఈ పాదయాత్రలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సమాజం సిగ్గుపడుతోంది. సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలని రాజ్యాంగంలో ఉందా? రిటైరైన వాళ్లను సలహాదారులుగా పెట్టుకోవాలని రాజ్యాంగంలో ఉందా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఉందా? జీవోలతో ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టాలని రాజ్యాంగంలో ఉందా? ఇవేవీ రాజ్యాంగంలో లేనందునే కొత్తది కావాలంటున్నారా?’’ అని కేసీఆర్ను ప్రశ్నించారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. సీఎం కేసీఆర్నే అన్నారు. కేసీఆర్ పాలన పోవాలి.. ప్రజాస్వామిక తెలంగాణ రావాలన్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. అభినవ అంబేడ్కర్ తానేనని పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. అవినీతిపై విచారణ భయంతోనే కేసీఆర్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...