BJP: ఈనెల 14 నుంచి బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో రెండో విడత పాదయాత్రపై
హైదరబాద్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో రెండో విడత పాదయాత్రపై సన్నాహక సమావేశం జరిగింది. డీకే అరుణ, గంగిడి మనోహర్ రెడ్డి, టి.వీరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల 14న జోగులాంబ జిల్లా గద్వాల జిల్లా నుంచి ప్రారభమయ్యే యాత్రపై చర్చించారు. మొదటి విడత మాదిరిగా రెండో విడత కూడా విజయవంతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రూట్ మ్యాప్, పాదయాత్ర ఏర్పాట్లు, నిర్వహణ కమిటీలపై చర్చించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ...‘‘ పాతబస్తీలో సత్తా చాటినం.. రెండో విడత పాదయాత్రలో చరిత్ర సృష్టిద్దాం. కల్వకుంట్ల పాలనను అంతం చేయడమే పాదయాత్ర లక్ష్యం. రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్.. అంబేడ్కర్ను అవమానించారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ఆయన జయంతి రోజునే రెండో విడత పాదయాత్ర చేపడుతున్నాం. తెలంగాణ ఉద్యమ కారులు భాజపాలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. తెరాస పాలనలో విసుగెత్తిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులను ఏకతాటిపైకి తీసుకొద్దాం’’ అని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?