Bandi Sanjay: ఈ నెల 27న పాదయాత్ర ముగింపు: బండి సంజయ్‌

వరంగల్‌ భద్రకాళి ఆలయం వద్ద ఈ నెల 27న ప్రజాసంగ్రామ యాత్ర ముగియనున్నట్లు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు.

Updated : 22 Aug 2022 00:33 IST

హైదరాబాద్‌: వరంగల్‌ భద్రకాళి ఆలయం వద్ద ఈ నెల 27న ప్రజాసంగ్రామ యాత్ర ముగియనున్నట్లు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ పాదయాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా వస్తారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. భాజపా ముఖ్యనేతలతో అమిత్‌ షా సమావేశం అనంతరం బండి సంజయ్‌ మాట్లాడారు. ఈడీ పేరు చెబితే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని బండి సంజయ్‌ అన్నారు. ఎన్టీఆర్‌ మర్యాద పూర్వకంగానే అమిత్‌ షాను కలిసినట్లు పేర్కొన్నారు. అమిత్‌ షా, ఎన్టీఆర్‌ ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదన్నారు. మునుగోడు సభ విజయవంతమైందని బండి సంజయ్‌ తెలిపారు. మునుగోడు అభివృద్ధికి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు