రెండు చోట్లా విజయం మాదే: సంజయ్‌

రాష్ట్రం జరిగిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు...

Updated : 14 Mar 2021 18:49 IST

హైదరాబాద్‌: రాష్ట్రం జరిగిన రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీదే విజయమని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి తెరాస డబ్బు పంపిణీ చేసిందని.. అయినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. 

తెరాసకు రెండో స్థానం కూడా దక్కదన్నారు. పొత్తు విషయంలో జనసేనతో ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు. ఏమైనా ఇబ్బంది ఉంటే తనతో చర్చించవచ్చన్నారు. తెరాసకు జనసేన మద్దతు ప్రకటించడం బాధ కలిగించిందని సంజయ్‌ అన్నారు.  గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసను జనసేన వ్యతిరేకించి ఇవాళ మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని