Bandi Sanjay: ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా?: బండి సంజయ్
ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా?అని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
కరీంనగర్: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఉంటుందని, కర్ణాటకలో భాజపా ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెప్పారు. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు. గత ఎన్నికల్లో భాజపాకు 36 శాతం ఓట్లు వచ్చాయని, ఈసారి కూడా 36శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ 38 నుంచి 43 శాతానికి పెరిగిందన్నారు. జేడీఎస్ ఓటింగ్ షేర్ 20 నుంచి 13శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
‘‘అన్ని పార్టీలు కలిసి భాజపాను ఎదుర్కొన్నాయి. కర్ణాటకలో మత రాజకీయాలు చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీకి మద్దతిచ్చిన కేసీఆర్.. కర్ణాటకలో పెద్దన్న పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్లతో గెలిచింది. ఎస్డీపీఐ, ఎంఐఎంలు కాంగ్రెస్కు సపోర్టు చేశాయి. తెలంగాణలో ఐదు ఉప ఎన్నికలు జరిగితే రెండింటిలో భాజపా గెలిచింది. మునుగోడులోనూ మేమే గెలిచినట్టు లెక్క. కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు.
జీహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లకు వచ్చాం. ఒక్క రాష్ట్రంలో గెలవగానే కేంద్రంలో అధికారంలోకి వస్తారా? తెలంగాణలోనూ మా ఓటింగ్ శాతం పెరిగింది. కర్ణాటక క్యాంపు రాజకీయాలు సీఎం కేసీఆర్ అండతోనే హైదరాబాద్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం. దమ్ముంటే కర్ణాటకలో ప్రకటించినట్లుగా నాలుగు శాతం రిజర్వేషన్ సహా, భజరంగ్దళ్ను నిషేదిస్తామని తెలంగాణలో చెప్పగలరా? కేసీఆర్కు తెలియకుండా హైదరాబాద్లో క్యాంపు రాజకీయాలు నడుస్తాయా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస కలిసి పోటీ చేస్తాయి’’ అని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్