Bandi sanjay: మునుగోడులో సీఎం కేసీఆర్‌ అవినీతి చిట్టా బయటపెడతాం: బండి సంజయ్‌

సీఎం కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 21 Aug 2022 15:17 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భయంతో సీఎం నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని విమర్శించారు. మునుగోడు వేదికగా కేసీఆర్‌ నిన్న అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తామన్నారు. మునుగోడులోనే కేసీఆర్‌ అవినీతి చిట్టా బయటపెడతామని సంజయ్‌ తెలిపారు. 

మరోవైపు మునుగోడులో సభకు ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ చేరుకున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సాంబమూర్తి నగర్‌లోని సత్యనారాయణ అనే కార్యకర్త ఇంటికి వెళ్లి తేనీరు సేవించారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మరికాసేపట్లో మునుగోడు సభకు బయల్దేరి వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని