Telangana News: హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది...

Updated : 29 Jun 2022 10:45 IST

హైదరాబాద్: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. నల్లధనం వెనక్కి తెప్పించడం సహా... నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలను ఫ్లెక్సీలో ముద్రించారు. బై బై మోదీ.. అనే హ్యాష్ ట్యాగ్‌తో ఉన్న ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత లేదు. ఇదే కాకుండా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లోనూ మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్లీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుపై సమాచారం అందుకున్న కంటోన్‌మెంట్‌ సిబ్బంది వెంటనే పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని