పోలింగ్ కేంద్రం నుంచి గవర్నర్కు దీదీ ఫోన్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉద్రికత్తల నడుమ కొనసాగుతోంది. పలు చోట్ల తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను
నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తత నడుమ కొనసాగుతోంది. పలు చోట్ల తృణమూల్ కాంగ్రెస్, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్లోని ఓ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అభ్యర్థి మమతా బెనర్జీ.. అక్కడి నుంచే గవర్నర్కు ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో నందిగ్రామ్ పోలింగ్ ఉద్రిక్తంగా మారింది.
పలు కేంద్రాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, భాజపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకుంటున్నారని తృణమూల్ నేతలు ఆరోపించారు. దీంతో నందిగ్రామ్లోనే ఉన్న మమత.. అక్కడి బోయల్ ప్రాంతంలో గల 7వ నంబరు పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అక్కడ ఒకింత ఘర్షణ వాతావరణం నెలకొంది. మమత రాకపై తృణమూల్, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
మరోవైపు పోలింగ్ కేంద్రం నుంచే దీదీ.. గవర్నర్ జగదీప్ ధన్కర్కు ఫోన్ చేశారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి గూండాలు బెంగాల్కు వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. వారికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. స్థానికులు ఓట్లు వేయకుండా ఆ గూండాలు అడ్డుకుంటున్నారు. నందిగ్రామ్లో ఏ క్షణాన ఏదైనా జరగొచ్చు. మేం ఉదయం నుంచి ఎన్నికల కమిషన్కు 63 ఫిర్యాదులు చేశా. కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరైనా దీనిపై చర్యలు తీసుకోండి’’ అని గవర్నర్ను కోరారు. అంతకుముందు ఆమె బోయల్కు చేరుకోగానే.. భాజపా కార్యకర్తలు ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు.
రెండో విడత పోలింగ్లో భాగంగా బెంగాల్లో కీలక నందిగ్రామ్తో పాటు 30 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. సువేందు అధికారి కాన్వాయ్పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?