Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
పశ్చిమబెంగాల్లో (West Bengal) ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బేరాన్ బిశ్వాస్.. తాజాగా తృణమూల్ కాంగ్రెస్లో (TMC) చేరిపోయారు.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీలో కాంగ్రెస్ (Congress) పార్టీకి చుక్కెదురైంది. ఆ పార్టీకి చెందిన బేరాన్ బిశ్వాస్ తృణమూల్ కాంగ్రెస్లో (TMC) చేరిపోయారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ అయినట్లయ్యింది. రాష్ట్రంలో (West Bengal) కాంగ్రెస్కు ఇటీవల ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎన్నికకాగా.. ప్రస్తుతం ఆయన కూడా టీఎంసీలో చేరిపోవడం గమనార్హం.
సాగర్దిఘీ నియోజకవర్గానికి మూన్నెళ్ల క్రితం ఉప ఎన్నిక జరిగింది. ఇందులో కాంగ్రెస్కు చెందిన బేరాన్ బిశ్వాస్ ప్రత్యర్థి టీఎంసీపై విజయం సాధించారు. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు పొందని కాంగ్రెస్కు.. రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించినట్లయ్యింది. అయితే, అది మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. తాజాగా సాగర్దిఘీ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ తృణమూల్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బిశ్వాస్.. తన విజయంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని పేర్కొన్నారు.
తృణమూల్ కీలక నేత అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో భాజపాపై పోరాడుతున్నామని చెబుతూనే.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను అభిషేక్ బెనర్జీ కొట్టిపడేశారు. తమ పార్టీ మాత్రమే భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతోందని ఉద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని