Bhabanipur by poll: బెంగాల్లో హింస తలెత్తకుండా వారికి ఆదేశాలు ఇవ్వండి
భవానీపూర్ సహా పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల అనంతరం...
కలకత్తా హైకోర్టు సీజేకు భవానీపూర్ భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ లేఖ
కోల్కతా: భవానీపూర్ సహా పశ్చిమ బెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్ చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్ ఆదివారం కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఏడాది మే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయాన్ని టిబ్రివాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
‘ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ అంతటా మారణకాండ జరగడాన్ని చూశాం. ఇది యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. టీఎంసీ శ్రేణుల దుశ్చర్యల పరిణామాలను నేటికీ అనుభవిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎలాంటి హింస, ప్రాణనష్టాలకు అవకాశం లేకుండా కోల్కతా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మరోవైపు ఓట్ల లెక్కింపులో భవానీపూర్ స్థానంలో మమత ఆధిక్యంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!