Bharat Jodo Yatra: సంగారెడ్డి జిల్లాలో సరదాగా రాహుల్ జోడోయాత్ర
సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జోడో యాత్ర సరదాగా సాగింది. చిన్నారులతో క్రికెట్ ఆడుతూ, పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్ర సాగించారు.
సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జోడో యాత్ర సరదాగా సాగింది. గురువారం పటాన్చెరు మండలం రుద్రారం శివారులోని గణేశ్ ఆలయం నుంచి ఉదయం 6 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. చిన్నారులతో క్రికెట్ ఆడుతూ, పాఠశాల విద్యార్థులతో చేతులు కలుపుతూ సరదాగా పాదయాత్ర సాగించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గంగపుత్ర, పోతురాజు, కల్లుగీత కార్మికులు వారి సంప్రదాయ వేషధారణలో రాహుల్కు అడుగడుగునా స్వాగతం పలికారు. రాహుల్ వెంట ఏఐసీసీ నేతలు బోసురాజు, దిగ్విజయ్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, మాజీ పీసీసీ ఉత్తమ్కుమార్రెడ్డి, సంగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత అన్ని వర్గాల ప్రజలు స్వాగతం పలికారు. దివ్యాంగులకు రాహుల్ చేతుల మీదుగా వీల్ఛైర్లను అందజేశారు. అనంతనం రామ్మందిరం సమీపంలో ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించి ఏర్పాటు చేసి ఫొటో ఎగ్జిబిషన్ను రాహుల్ తిలకించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పోతురాజు మాదిరిగా కొరడాతో రాహుల్ కొట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో