Rahul Gandhi: ప్రజల్ని భయపెట్టి నిజాలు దాచలేరు: రాహుల్
భారత్ జోడో యాత్ర ప్రారంభించి మంగళవారానికి 130 రోజులు పూర్తయింది. ఈ నెల 30 శ్రీనగర్లో త్రివర్ణ పతాకం ఎగురవేసి ఈ యాత్రకు రాహుల్ ముగింపు పలకనున్నారు.
జమ్ము: దేశ ప్రజలందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడంలో భారత్ జోడో యాత్ర (Bharat jodo Yatra) విజయం సాధించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. భాజపా (BJP), ఆరెస్సెస్(RSS)ల వల్ల ప్రజల్లో ఏర్పడిన విద్వేషాలను తొలగించి ప్రేమను పంచడంలో జోడో యాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ప్రస్తుతం జమ్ములో పర్యటిస్తున్న రాహుల్ విలేకరులతో మాట్లాడుతూ.. భాజపా, ఆరెస్సెస్లు ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చాయని ఆరోపించారు. ప్రజల స్వేచ్ఛను అణిచివేయడం, వాళ్లని భయపెట్టడం ద్వారా నిజాన్ని దాచలేరని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో ప్రజలకు కూడా ఓ క్లారిటీ వచ్చిందన్న రాహుల్.. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు. ఒకటి ద్వేషం, అహంకారంతో కూడినదైతే, మరొకటి ప్రేమను పంచిన వ్యవస్థ అని అన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ రెండింటి మధ్య ప్రజలకు స్పష్టమైన తేడా కనిపించిందన్నారు.
సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారంతో 130 రోజులు పూర్తి చేసుకుంది. జమ్మూలో పూర్తయిన ఈ పాదయాత్ర ఇవాళే కశ్మీర్లోకి ప్రవేశించింది. ఈ నెల 30న యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ‘‘ లక్షలాది మంది ఈ యాత్రకు మద్దతు పలికారు. భారతదేశ ప్రజలందర్నీ భారత్ జోడో యాత్ర ఏకతాటిపైకి తీసుకొచ్చింది. మోసకారి మాటలు కాకుండా భారతీయులు ప్రేమాభిమానాలనే నమ్ముతారని రుజువు చేసింది. భాజపా, ఆరెస్సెస్ సృష్టించిన ద్వేషపూరిత వాతావరణానికి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా సాగిన ఈ యాత్ర పూర్తిస్థాయిలో విజయం సాధించింది’’ అని రాహుల్ అన్నారు. భాజపా పాలనలో సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోతోందని ఆయన విమర్శించారు.ఈ యాత్ర ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న బీబీసీ డాక్యుమెంటరీపై స్పందిస్తూ.. నిజాలు ఎప్పటికీ దాగవని రాహుల్ అన్నారు. ‘‘నిషేధాలు విధించినా, మీడియాను తొక్కిపెట్టినా, స్వతంత్ర సంస్థల్ని అదుపు చేసినా, సీబీఐ, ఈడీలను ఉపయోగించినా నిజాలు బయటకు రాకుండా ఆపడం అసాధ్యం’’ అని వ్యాఖ్యానించారు. కమల దళం ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడాలనుకున్నా.. అధిష్ఠానం నుంచి అనుమతిపొందాల్సిందేనని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు కూడా ఆ పార్టీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రలో ఎంతో మందిని కలిశానని, వాళ్ల బాధలు తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రాహుల్ అన్నారు. దేశం నుంచి హింసను ఎలాగైనా పారద్రోలాలని,అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని రాహుల్ పేర్కొన్నారు.
‘నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు రూ.వేల కోట్లు ఖర్చు ’
తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు భాజపా, ఆర్ఎస్ఎస్లు రూ.వేలాది కోట్లు ఖర్చు చేశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఆ కోట్ల రూపాయాలు.. అసలు నిజాన్ని దాచలేవని, అది బయటకు వచ్చే తీరుతుందని పేర్కొన్నారు. రాహుల్పై ఉన్న 'పప్పు' మచ్చను తొలగించేందుకు కాంగ్రెస్ రూ.కోట్లు ఖర్చు చేస్తోందా? అన్న ప్రశ్నపై ఈ మేరకు స్పందించారు. ‘‘ దేశంలో డబ్బు, అధికారం, అహంకారం కాదు.. సత్యానిదే పైచేయి అని భాజపాకు కాంగ్రెస్ బోధపరుస్తుంది. సత్యం ఎల్లప్పుడూ డబ్బు, అధికారాన్ని పక్కన పెడుతుంది. ఈ కఠోర వాస్తవం భాజపా నాయకులకు నెమ్మదిగా స్పష్టమవుతోంది’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
బ్యాలెట్తో ఎన్నికలంటే భాజపాకు భయమెందుకు?
ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, మనదేశంలో బ్యాలెట్ ఎన్నికలంటే భాజపాకు, ప్రధాని మోదీకి భయమెందుకని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
నామినేషన్లకు వేళాయె..
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. -
అడ్డంకులు లేకుండా నామినేషన్ల ప్రక్రియ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా గురువారం ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. -
కాంగ్రెస్లో వలసల ప్రభావమెంత?
కాంగ్రెస్లోకి కొనసాగుతున్న భారీ వలసలు లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దేశంలో సురక్షితమైన సీటు లేదని, భవిష్యత్తులో ఆయన మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
కేరళలోని వయనాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, భాజపాపై విమర్శలు గుప్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!