కొనుగోలు కేంద్రాల రద్దు సరైనది కాదు: భట్టి
ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.తెరాస నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.తెరాస నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళతామన్నారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఒకరోజు దీక్ష ముగిసిన సందర్భంగా అయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి నూతన వ్యవసాయ చట్టాలతో ప్రమాదం ఉందని భట్టి అన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించడం సరైనది కాదన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రూ.4 లక్షల వరకు విరాళాలు సేకరించామని, దీంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల నెల జీతం జోడించి దిల్లీ రైతులకు ఇస్తామని భట్టి వెల్లడించారు. సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని భట్టి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.