రాత్రి కర్ఫ్యూ కంటితుడుపు చర్య: భట్టి
కొవిడ్ తీవ్రత నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ఫ్రయోజనకరమైన చర్య అని
హైదరాబాద్: కొవిడ్ తీవ్రత నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిష్ఫ్రయోజనకరమైన చర్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భట్టి ఓ ప్రకటన విడుదల చేశారు. జన సంచారం స్వల్పంగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టడంలో ఔచిత్యం ఏమిటో.. ఈ విధమైన చర్యలు కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరిస్తాయో అర్థం కావడం లేదన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందని భట్టి విమర్శించారు.
కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలంటూ అసెంబ్లీ సమావేశాల్లోనే తాము చెప్పామని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆ విషయాన్ని పెడచెవిన పెట్టడంతో పాటు పబ్లు, మద్యం దుకాణాలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో నిమ్మకుండిపోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అందరి సలహాలు, సూచనలతో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని.. రాత్రి కాకుండా పగటి పూట కర్ఫ్యూ విధించాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!