Munugode Bypoll: మునుగోడు బరిలో ఎవరు?.. ఎంపీ కోమటిరెడ్డితో భట్టి విక్రమార్క భేటీ
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తెలిపానని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తెలిపానని పీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. ఇవాళ భట్టి విక్రమార్క.. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. గత రెండ్రోజులుగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరిగిన కసరత్తుపై కోమటిరెడ్డికి వివరించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకు వచ్చిన ఆశావహుల పేర్లను ఆయనకు తెలియజేశానని భట్టి పేర్కొన్నారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభ్యర్థి విషయంలో తనతో చర్చించేందుకు భట్టి విక్రమార్క వచ్చినట్టు చెప్పారు. అభ్యర్థిని సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మునుగోడులో ప్రచారానికి తాను వెళ్లనున్నట్టు కోమటిరెడ్డి వెంకటర్రెడ్డి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు