Munugode Bypoll: మునుగోడు బరిలో ఎవరు?.. ఎంపీ కోమటిరెడ్డితో భట్టి విక్రమార్క భేటీ

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తెలిపానని పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ

Published : 26 Aug 2022 01:08 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు తెలిపానని పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. ఇవాళ భట్టి విక్రమార్క.. కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. గత రెండ్రోజులుగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరిగిన కసరత్తుపై కోమటిరెడ్డికి వివరించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకు వచ్చిన ఆశావహుల పేర్లను ఆయనకు తెలియజేశానని భట్టి పేర్కొన్నారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారన్నారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు అభ్యర్థి విషయంలో తనతో చర్చించేందుకు భట్టి విక్రమార్క వచ్చినట్టు చెప్పారు. అభ్యర్థిని సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మునుగోడులో ప్రచారానికి తాను వెళ్లనున్నట్టు కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని