లక్ష ఇళ్లని చెప్పి 3,428 చూపించారు: భట్టి
లక్ష రెండు పడక గదుల ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు...
హైదరాబాద్: లక్ష రెండు పడక గదుల ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమకు లక్ష రెండు పడకగదుల ఇళ్లు చూపిస్తామని చెప్పి రెండ్రోజులు చూపించి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు.
రెండ్రోజుల్లో కేవలం 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని చెప్పారు. శాసనసభలో ఛాలెంజ్ చేసి మమ్మల్ని తీసుకెళ్లిన వాళ్లు చెప్పిన లెక్క 3,428 అని వివరించారు. లక్షల ఇళ్లు కట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ప్రతి సారి ఎన్నికల సమయంలో, శాసనసభలో తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తెరాస మోసం చేస్తోందన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి నాలుగువేల ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొన్ని చోట్ల పనులే ప్రారంభించలేదన్నారు. హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేయడం దుర్మార్గమని భట్టి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్