Bihar: లాలూ ఇంటికి నితీశ్.. బిహార్ రాజకీయాల్లో విస్తృత చర్చ!

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ కుమార్ హాజరు కావటం బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది......

Published : 23 Apr 2022 16:36 IST

పాట్న: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ కుమార్ హాజరు కావటం బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2017లో లాలూ నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన నితీశ్.. ఐదేళ్ల తర్వాత మరోసారి ఒకప్పటి మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత ఇంట్లో జరిగిన వేడుకకు హాజరుకావటం విశేషం. ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం నితీశ్.. రబ్రీదేవితో పాటు లాలూ కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఫొటోలు దిగారు.

అవినీతి ఆరోపణల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే నితీశ్ కుమార్‌.. లాలూ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది. అయితే, మరోవైపు ఇఫ్తార్ విందుకు హాజరుకావటంపై వస్తున్న ఊహాగానాలను నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ఇఫ్తార్ విందుకు చాలా మంది ఆహ్వానిస్తుంటారని, వెళ్లడానికి రాజకీయాలకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. ఆర్​జేడీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరై.. భాగస్వామ్య పక్షమైన భాజపాకు పరోక్ష సందేశం పంపారన్న ఊహాగానాలను నితీశ్ తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని