పాలక్కడ్ నుంచి మెట్రోమ్యాన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామ......
దిల్లీ: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రకటించింది. మొత్తం 140 స్థానాలకు గానూ 112 మంది అభ్యర్థులను పేర్లను ప్రకటించింది. 115 స్థానాలకు పోటీ చేస్తున్నామని, మిగిలిన స్థానాలను ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ‘మెట్రోమ్యాన్’ శ్రీధరన్ పాలక్కడ్ నుంచి పోటీ చేయనున్నారని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ రెండు స్థానాల నుంచి (మంజేశ్వర్, కొన్ని) పోటీ చేయనున్నారు.
భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుమ్మనమ్ రాజశేఖరన్కు నెమ్మమ్ సీటు కేటాయించారు. కేంద్ర మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్కు కంజిరిప్పళ్లి స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. నటుడు సురేష్ గోపీ త్రిస్సూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఏప్రిల్ 6న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. మే2న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. రాష్ట్రంలో కొన్ని స్థానాలనైనా ఒడిసి పట్టాలని భాజపా పట్టుదలతో ఉంది.
బెంగాల్లో 63 స్థానాలకు
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మూడు, నాలుగు విడతల్లో జరగబోయే స్థానాలకు 63 మంది అభ్యర్థుల జాబితాను భాజపా ప్రకటించింది. ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అశోక్ లాహిరి అలీపుర్దౌర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు తొల్లిగుంజె స్థానం కేటాయించారు.
కుష్బూ అక్కడి నుంచే..
ఇక తమిళనాడు విషయానికొస్తే ఇటీవల పార్టీలో చేరిన కుష్బూ సుందర్కు థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ సీటును కేటాయించారు. పార్టీ మహిళా సెల్ చీఫ్ వనతి శ్రీనివాసన్.. కమల్హాసన్ పోటీగా దక్షిణ కోయంబత్తూరు నుంచి పోటీ చేయనున్నారు. మొత్తం 20 స్థానాల్లో భాజపా పోటీ చేయనుండగా.. 17 స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. ఇక అసోం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు గాను 92 స్థానాల్లో అభ్యర్థులను భాజపా నిలబెట్టనుంది. మిగిలిన సీట్లు మిత్రపక్షాలకు కేటాయించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు