Andhra News: అధికారంలోకి వస్తే దానిపైనే తొలిసంతకం: సోము వీర్రాజు

వచ్చే ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూ1 జోన్ రద్దు దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 19 Apr 2022 15:10 IST

మంగళగిరి: వచ్చే ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే యూ1 జోన్ రద్దు దస్త్రం పైనే తొలి సంతకం చేస్తామని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తాడేపల్లిలో యూ-1 జోన్ ఎత్తివేయాలంటూ గత 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు ఆయన మద్దతు పలికారు. రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోన్ వల్ల తాము పడుతున్న ఇబ్బందులను రైతులు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని సోము వీర్రాజు వారికి హామీ ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని