AP News: అమరావతి రైతులకు కౌలు తప్పక చెల్లించాలి: సోము వీర్రాజు

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేయాలని భాజపా రాష్ట్ర

Updated : 24 Jul 2021 12:17 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ కార్యకలాపాల కోసం స్థలాలు తీసుకున్నాయని.. వాటిని ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు జిల్లా తాళ్లయపాలెం నుంచి రాష్ట్రంలో ఉన్న ఆలయాలను సందర్శించాలనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఏటా తప్పనిసరిగా కౌలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని