UP Election 2022 : లతా మంగేష్కర్ మరణం.. యూపీ భాజపా మేనిఫెస్టో విడుదల వాయిదా!
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) మరణంతో ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్ప్రదేశ్ భాజపా ప్రకటించింది.
యూపీ భాజపా నిర్ణయం
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అధికార భాజపా ఆదివారం నాడు మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం అగ్రనేతలు లఖ్నవూ చేరుకున్నారు. ఇదే సమయంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) మరణంతో ఆమెక గౌరవ సూచికంగా ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫిబ్రవరి 10న ఉత్తర్ప్రదేశ్లో తొలివిడత పోలింగ్ జరుగుతున్నందున.. ఎన్నికల ప్రచారాన్ని అధికార భాజపా ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆదివారం నాడు పార్టీ మేనిఫెస్టో విడుదల కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, స్వతంత్ర దేవ్, కేశవ్ మౌర్య వంటి కీలక నాయకులు లఖ్నవూ చేరుకున్నారు. ఇదే సమయంలో గాయని లతా మంగేష్కర్ మరణం చెందారనే వార్త తెలిసింది. దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా భాజపా నాయకులు ఆమెకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇక లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్న ఆయన.. ఆమెతో గతంలో జరిపిన సంభాషణలు మరువలేనివని గుర్తుచేశారు. ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ ఈ మధ్యాహ్నం ముంబయి చేరుకోనున్నారు. మరోవైపు లతా మంగేష్కర్ మరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా