gujarat assembly elections:‘పద్మ’వ్యూహంలో ప్రతిపక్షాలు కకావికలం..!
గుజరాత్(Gujarat) ఎన్నికలకు భాజపా(BJP) కేవలం మోదీ(Modi)ని నమ్ముకొని వెళ్లలేదు.. విజయానికి అవసరమైన గ్రౌండ్ వర్క్ను దాదాపు ఏడాదిన్నర నుంచే మొదలుపెట్టింది.
2017 ఎన్నికల సమయంలో గుజరాత్ కాంగ్రెస్ దివంగత నేత అహ్మద్ పటేల్, అప్పటి గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అశోక్ గహ్లోత్ చురుగ్గా వ్యూహరచన చేయడంతో భాజపా గట్టిపోటీని ఎదుర్కొంది. భాజపా 99 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ ఆ మేరకు మెరుగుపడి 77 స్థానాలు గెలుచుకుంది. ఈ పరిణామం భాజపాలో ప్రమాదఘంటికలను మోగించింది. దీంతో ఈ సారి కమలనాథులు మొదటి నుంచే అప్రమత్తమై వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో విజయానికి నరేంద్ర మోదీ చరిష్మానే భాజపా నమ్ముకున్నా.. క్షేత్రస్థాయిలో కూడా విపరీతంగా శ్రమించింది. ఈ క్రమంలో ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి కూడా వెనుకాడలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యూహాలన్నీ ఇప్పుడు ఫలితాన్నిచ్చి గుజరాత్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని కమలం పార్టీకి కట్టబెట్టాయి. 2002లో భాజపా 127 స్థానాలను గెలుచుకొంటే ఈ సారి ఆ రికార్డును బద్దలుకొట్టి కొత్త చరిత్ర లిఖించింది.
ప్రతి అడుగు పక్కా ప్రణాళికతో..
♦ ఎన్నికలకు ఏడాది ముందుగానే విజయ్ రూపానీ, ఆయన మంత్రివర్గాన్ని భాజపా పక్కనపెట్టి.. భూపేంద్ర పటేల్కు పగ్గాలు అప్పగించింది. దీంతో రూపానీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు చెక్పెట్టినట్లైంది. దీనికి తోడు పటేల్ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తిని బుజ్జగించినట్లైంది. అంతకు ముందే కేంద్ర మంత్రివర్గంలో కూడా ఓబీసీలకు స్థానాలను కల్పిస్తూ పునర్ వ్యవస్థీకరించింది. దేవశీష్ చౌహాన్, దర్శనా జర్దోష్, డాక్టర్ మహేంద్ర ముంజుపారకు స్థానం కల్పించింది. గుజరాత్లో 37శాతం ఉన్న ఈ ఓబీసీ ఓటర్లు 90 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరు.
♦ పనితీరు బాగోని 42 మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లను నిరాకరిచింది. వీరిలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ చర్యలు భాజపా ఇమేజ్ను పెంచాయి.
♦ 2017లో కాంగ్రెస్ పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్పటేల్ను భాజపా అక్కున చేర్చుకొంది. కీలక కులాలకు ప్రాతినిధ్యం వహించే నేతలను హస్తం వదులుకొంటే.. కమలం ఒడిసి పట్టింది. కున్వర్జీ బవలియా (కోలి), హార్దిక్ పటేల్ (పాటీదార్), అల్పేశ్ ఠాకూర్(ఓబీసీ) కాంగ్రెస్ నుంచి భాజపాకు వలస వచ్చారు.
♦ ఆత్మనిర్భర్ గుజరాత్ కార్యక్రమం కింద భాజపా 15లక్షల ఉద్యోగాలకు హామీ ఇవ్వడం ఆకర్షించింది. దీనికి తోడు వేదాంత-ఫాక్స్కాన్ సెమీకండెక్టర్ ప్లాంట్, టాటా -ఎయిర్ బస్ విమాన తయారీ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులు ఎన్నికల ముందు రాష్ట్రానికి రావడం కలిసొచ్చింది.
♦ సహకార సమాఖ్యలపై కమలనాధుల పట్టు ఈ ఎన్నికల్లో ఫలితాన్నిచ్చింది. ఎన్నికలకు ఏడాది ముందుగానే 2021 జులైలో హోం మంత్రి అమిత్షా చేతికి సహకారశాఖ పగ్గాలను కూడా అప్పగించడం దీనిలో భాగమే.
♦ గుజరాత్లో కీలక సామాజిక వర్గమైన పాటీదార్లకు చెందిన నేత భూపేంద్ర పటేల్కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. అంతేకాదు.. ఈ సారి ఎన్నికల్లో 25శాతం మంది ఆ వర్గానికి చెందినవారే. హర్దిక్ పటేల్ రాక, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్థించడం వంటివి సానుకూలాంశాలుగా మారాయి.
♦ గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2002లో నమోదైన కేసులో ప్రధాని మోదీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం కమలం పార్టీకి అదనపు బలాన్ని అందించింది. అప్పట్లో అల్లర్ల సమయంలో మోదీని బాధితుడిగా భాజపా ప్రచారం చేసుకొంది.
♦ ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయడం భాజపాకు బాగా కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత అతితక్కువగా ఉన్న సమయంలో కొత్తపార్టీ కూడా బరిలోకి దిగడం కాంగ్రెస్కు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ భారీగా చీల్చింది.
♦ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కురిపించిన ఉచిత హమీలను నమ్మశక్యం కాని తాయిలాలుగా ప్రచారం చేయడంలో కమలనాధులు విజయం సాధించారు. దీనికి తోడు గుజరాత్ ఆత్మగౌరవాన్ని తెరపైకి తీసుకొచ్చి భాజపా లబ్ధిపొందింది.
ఎన్నికల సైన్యం కూర్పు..
భాజపా గుజరాత్లో ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. దీంతో కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్, గుజరాత్ నాయకులతో ఎన్నికల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో కేంద్ర మంత్రులు అమిత్షా, భూపేంద్ర యాదవ్, పురుషోత్తమ్ రూపాలా, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవీయ, దర్శనా జర్దోష్ ఉన్నారు. వీరితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ, పార్టీ నాయకులు అమిత్ ఠక్కర్, సీఆర్ పాటిల్, ప్రదీప్ సింగ్ వాఘేలా, రత్నాకర్, విజయ్ చౌత్వాలే, సిద్ధార్థ్ పటేల్, ఆర్ఎస్ఎస్ నుంచి అతుల్ లిమాయ్ వంటి దాదాపు 150 మంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. బయట ప్రాంతాల్లో స్థిరపడ్డ భాజపా నాయకులను కూడా సచేతనం చేసింది. ఉత్తర గుజరాత్లోని నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాత్మక బృందాలను అమిత్షా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాటీదార్ల ఓటర్లను మెప్పించే పనిని భూపేంద్ర పటేల్ స్వీకరించారు. అసంతృప్తితో పార్టీని వీడిన వారిని తిరిగి తెచ్చే బాధ్యతను హోం మంత్రి హర్ష్ సంఘ్వీ తీసుకొన్నారు. ఆదివాసీ జాతులు ఎక్కువగా ఉన్న 14 జిల్లాల్లో ప్రచారాన్ని అమిత్ ఠక్కర్ అందుకున్నారు. ఇలా ఈ బృందం ఎటువంటి హడావుడి లేకుండా తమ పనులు చేసుకొంటూ పోయింది.
సుడిగాలి ప్రచారం..
ఈ ఎన్నికల్లో మోదీ సుడిగాలి పర్యటనలు అద్భుతంగా ప్రభావం చూపాయి. దీంతోపాటు 40 మంది స్టార్ ప్రచారకర్తల బృందాన్ని ఏర్పాటు చేసుకొంది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నుంచి మోదీ 20 రోజులు గుజరాత్లోనే గడిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ పర్యటనలు సాగాయి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా 31 ర్యాలీలు 2 భారీ రోడ్షోలు నిర్వహించారు. అహ్మదాబాద్ రోడ్షోలో ఏకంగా మూడు గంటల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించి 15 నియోజకవర్గాల్లో ప్రచారం చేయడం విశేషం. మరోవైపు పార్టీ అగ్రనేత అమిత్ షా సెప్టెంబర్ - అక్టోబర్ మధ్యనే 16 రోజులు గుజరాత్లో ఉన్నారంటే భాజపా వ్యూహ రచన ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 50కిపైగా ర్యాలీల్లో ఆయన ప్రచారం చేశారు.
దారీ తెన్ను లేని కాంగ్రెస్ వ్యూహం..
2017లో గుజరాత్లో 77 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఆ తర్వాత బలమైన ప్రతిపక్షంగా నిలవడంలో విఫలమైంది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ గుజరాత్లో అడుగుపెట్టింది. సూరత్ నగరపాలికలో 27 స్థానాలను దక్కించుకొంది. మరో వైపు ప్రచార సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకే అధిక ప్రాధన్యమివ్వడం హస్తం పార్టీని దెబ్బకొట్టింది. రాహుల్ కేవలం గుజరాత్లో సూరత్, రాజ్కోట్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ గతంలో అనుసరించిన ‘KHAM’ ( క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం) వ్యూహం మరోసారి తెరమీదకు తెచ్చింది. ఇందులో భాగంగానే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇంద్రవిజయ్ సిన్హ్ గోహిల్ను జులైలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. మొత్తం ఏడుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఎస్సీ వర్గానికి చెందిన జిగ్నేశ్ మేవానీ, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఖాదిర్ ఫిర్జాదాలకు కూడా స్థానం కల్పించింది. ఈ వ్యూహం పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు