Himachal polls 2022: సంప్రదాయం కొనసాగిస్తారో? చరిత్ర తిరగరాస్తారో?
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Himachal Pradesh polls 2022)కు వేళైంది. శనివారం 68 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Himachal Pradesh polls 2022)కు వేళైంది. శనివారం 68 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, పోలీసు బలగాలు ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. 1982 నుంచి ఒక దఫా భాజపా, మరో దఫా కాంగ్రెస్కు అధికారం ఇస్తోన్న హిమాచల్ప్రదేశ్ ప్రజలు ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తారా? లేదంటే అందుకు భిన్నంగా చరిత్రను తిరగరాస్తారా? అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అధికార పార్టీలో పెన్షన్ గుబులు..
‘డబుల్ ఇంజిన్’ సర్కార్తోనే అభివృద్ధి అనే నినాదంతో కమలనాథులు ప్రచారాన్ని హోరెత్తించారు. ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్ర తిరగరాయాలన్న కసితో సర్వశక్తులూ ధారపోశారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ప్రముఖ నేతలంతా తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మళ్లీ అధికార పీఠం అప్పగిస్తే రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడంతో పాటు 8లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ సారథ్యంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్న ధీమాతో కమలనాథులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అధికార భాజపాలో గుబులు రేపుతున్నాయి. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు రూ.1500 ఆర్థికసాయం, యువతకు లక్ష ఉద్యోగాలు తదితర హామీలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయింది. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఐదేళ్ల తర్వాత ప్రజలు సంప్రదాయంగా తమను ఆదరిస్తారన్న విశ్వాసంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు, పంజాబ్లో గెలుపుతో మంచి ఉత్సాహంతో ఉన్న ఆప్ హిమాచల్ప్రదేశ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. దిల్లీ మోడల్ పాలనను చూపించి తమకు అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతోంది. పాత పింఛను విధానం పునరుద్ధరణ, ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తామంటూ హామీలు ఇచ్చింది.
కాంగ్రెస్కు పెను సవాలే..
ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి అగ్రనేతలు ప్రచారం చేయగా.. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ మాత్రమే ఎన్నికల ప్రచార ర్యాలీల్లో చురుగ్గా పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతున్న వేళ హిమాచల్ప్రదేశ్ను గెలుచుకోవడం ఆ పార్టీ మనుగడకు సంబంధించి ప్రతిష్టాత్మక అంశంగా మారింది. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటం వల్ల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. అలాగే, కాంగ్రెస్కు 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లిఖార్జున ఖర్గేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతుందనే అంశంపైనా ఆసక్తి నెలకొంది. ఇంకోవైపు, గత రెండేళ్లలో కాంగ్రెస్ తొమ్మిది రాష్ట్రాల్లో పరాభవాలనే చవిచూస్తూ వస్తోంది. గతేడాది పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఆ పార్టీ పరాభవం ఎదుర్కోగా.. ఈ ఏడాది పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బలు తింది. ఈ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పాత పింఛను విధానం పునరుద్ధరణ వంటి అంశాలను ప్రధానంగా లేవనెత్తుతూ విజయంపై ఆశలుపెట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్లో రాబోయే ఫలితం ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనుంది. అలాగే, కమలనాథులు ఆశిస్తున్నట్టుగా ఈ ఎన్నికల్లోనూ మళ్లీ భాజపా విజయం సాధిస్తే ఆ పార్టీకి ఇది చారిత్ర విజయం కావడంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. వచ్చే ఏడాది జరగబోయే పలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలకూ ఈ విజయం ఓ టానిక్లా ఉపయోగపడుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలు ప్రకటిస్తూ తీవ్రంగానే శ్రమించారు. ఈసారి హిమాచల్ప్రదేశ్లో నెలకొన్న త్రిముఖ పోరులో అక్కడి ప్రజలు గత సంప్రదాయాన్నే కొనసాగిస్తారో, చరిత్రను తిరగరాస్తారో చూడాలి.
55లక్షల మంది ఓటర్లు.. 412మంది అభ్యర్థులు..
హిమాచల్ప్రదేశ్లో మొత్తం 55,74,793 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 55,07,261మంది జనరల్ ఓటర్లు. 67,532మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. ఈసారి 43,173మంది యువత తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకోనుండటం విశేషం. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 1,21,409మంది 80 ఏళ్లకు పైబడిన వారు కాగా.. వీరిలో 1,136మంది శతాధిక వృద్ధులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, మాజీ సీఎం వీరభద్రసింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్, భాజపా మాజీ చీఫ్ సత్పాల్ సింగ్ సట్టి తదితరులు ఉన్నారు. సీఎం జైరాంఠాకూర్ మండీలోని సెరాజ్ నుంచి బరిలో నిలుస్తుండగా.. భాజపా మాజీ చీఫ్ సట్టి ఉనా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికలకు మొత్తం 7881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 789 పోలింగ్ బూత్లు సమస్యాత్మకమైనవిగా, 397 పోలింగ్ బూత్లో అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. శనివారం ఉదయం 8గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్ నమోదైంది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ బూత్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
భారీగా నగదు, మద్యం సీజ్
హిమాచల్ ప్రదేశ్లో భారీగా ప్రలోభాల పర్వం కొనసాగినట్టు కనబడుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా నగదు, మద్యం సీజ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. 2017 ఎన్నికల్లో కేవలం రూ.9.03 కోట్లు సీజ్ చేస్తే.. ఈసారి మాత్రం ఐదు రెట్లు అధికంగా అంటే దాదాపు రూ.50.28 కోట్లు విలువ చేసే నగదు, మద్యం, డ్రగ్స్, ఆభరణాలను సీజ్ చేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో రూ.17.18 కోట్ల నగదు ఉండగా.. రూ.17.50 కోట్ల విలువ చేసే 9,72,818.24 లీటర్ల మద్యం, రూ.1.20 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.13.99 కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM