Piyush Jain: పీయూష్ జైన్ మా వాడు కాదు.. మీవాడే: అఖిలేశ్ కౌంటర్
‘నల్లధన కుబేరుడు’ పీయూష్ జైన్ పన్ను ఎగవేత వ్యవహారం దేశంలోనే కాదు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పీయూష్ జైన్తో సమాజ్వాదీ పార్టీకి ......
భాజపా సొంత వ్యాపారి ఇంట్లో పొరపాటున దాడి చేయించిందన్న మాజీ సీఎం
ఉన్నావ్: ‘నల్లధన కుబేరుడు’ పీయూష్ జైన్ పన్ను ఎగవేత వ్యవహారం దేశంలోనే కాదు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పీయూష్ జైన్తో సమాజ్వాదీ పార్టీకి సంబంధాలు ఉన్నాయంటూ భాజపా నేతల ఆరోపణల్ని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఖండించారు. అతడితో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలూ లేవని స్పష్టంచేశారు. ఉన్నావ్లో మంగళవారం సమాజ్వాదీ రథయాత్ర ప్రారంభానికి ముందు అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ.. భాజపా సొంత వ్యాపారి అయిన పీయూష్ జైన్పై పొరపాటున దాడి చేయించిందన్నారు. అతడి కాల్ డేటాని చూస్తే పీయూష్ జైన్తో టచ్లో ఉన్న భాజపా నేతల పేర్లు బయటపడతాయన్నారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ బదులుగా డిజిటల్ మిస్టేక్ వల్ల పీయూష్ జైన్ ఇంట్లో దాడులు జరిగాయని తెలిపారు. టీవీ ఛానళ్లలో కూడా మొదట్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన వ్యక్తి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు స్క్రోలింగ్ వచ్చిందనీ.. ఆ తర్వాత మధ్యాహ్నానికి అది నిజం కాదని తెలిసి ప్రసారం చేయడం నిలిపివేశారని చెప్పారు. కాన్పూర్కు చెందిన వ్యాపారి ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరకడం పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వైఫల్యాన్ని రుజువు చేస్తున్నాయని అఖిలేశ్ మండిపడ్డారు.
ఇటీవల ఐటీ శాఖతో పాటు సీబీఐటీ, కస్టమ్స్ అధికారులు కాన్పూర్కు చెందిన అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంటిపై జరిపిన దాడుల్లో రూ.257 కోట్ల డబ్బుతో పాటు 25కిలోల బంగారం, 250కిలోల వెండిని స్వాధీనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాన్పూర్లోని అతడి ఇంటితో పాటు కన్నౌజ్లోని ఫ్యాక్టరీలోనూ సోదాలు జరిపి ఈ మొత్తాన్ని సీజ్ చేసి పీయూష్ జైన్ని అరెస్టు చేశారు. కాన్పూర్ కోర్టు పీయూష్ జైన్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. త్వరలో యూపీలో ఎన్నికలు జరగనున్న వేళ పీయూష్ జైన్ అరెస్టు వ్యవహారంలో భాజపా సమాజ్వాదీ పార్టీపై మాటల దాడికి దిగింది. అత్తరు వర్తకుడితో అఖిలేశ్ పార్టీకి సంబంధం ఉందంటూ ఆరోపిస్తోంది. అయితే, పీయూష్ జైన్తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సమాజ్వాదీ పార్టీ చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM