ఏపీలో భాజపా పుంజుకుంటుంది : సోము వీర్రాజు

విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. 

Published : 03 Apr 2022 01:43 IST

విజయవాడ :  విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం పంచాంగ పఠనం జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో భాజపా మరింతగా పుంజుకుంటుందని పంచాంగంలో ఉంది. రాష్ట్రంలో హిందువులకు అండగా ఉంటాం. శ్రీశైలంలో భక్తులకు ఎందుకు సౌకర్యాలు కల్పించడం లేదు? త్వరలోనే అక్కడ పర్యటిస్తాం. గుంటూరులో జిన్నా టవర్స్‌ పేరు మార్చే వరకూ రాష్ట్రవ్యాప్తంగా యువ మోర్చా ఆందోళన చేస్తుంది’ అని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని