Chirag Paswan: మరో ‘శిందే’ కోసం భాజపా, జేడీయూల వెతుకులాట..!
బిహార్లో ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా భాజపా, జేడీ(యూ) పార్టీలు ‘శిందే’ వంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని లోక్జనశక్తి పార్టీ (LJP) మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ ఆరోపించారు.
బిహార్లో ఎన్డీఏ మిత్రపక్షాలపై చిరాగ్ పాసవాన్ ఆరోపణలు
పట్నా: శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే (Eknath Shinde) నేతృత్వంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బిహార్లో ప్రత్యర్థులకు ప్రయోజనం కలిగించేలా భాజపా, జేడీ(యూ) పార్టీలు ‘శిందే’ వంటి నేత కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని లోక్జనశక్తి పార్టీ (LJP) మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ (Chirag Paswan) ఆరోపించారు. కేవలం అధికారం కోసమే రెండు పార్టీలు కూటమిలో కొనసాగుతున్నాయన్న ఆయన.. తమ కాళ్లకింద దుప్పటిని లాక్కునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో భాజపా సంఖ్యను తగ్గించేందుకే ముఖ్యమంత్రి నీతీశ్ ప్రయత్నిస్తున్నారని చిరాగ్ పాసవాన్ ఆరోపించారు.
‘బిహార్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ (AIMIM) ఎమ్మెల్యేలు గెలిచినప్పటి నుంచి వారు జేడీయూతో టచ్లో ఉన్న విషయం అందరికీ తెలుసు. బిహార్లో ఆ పార్టీకి ఉన్న తక్కువ ఆదరణ దృష్ట్యా అందులో భవిష్యత్తు లేదని వారికి అర్థమయ్యింది. ఈ క్రమంలో సీఎం పార్టీలో కాకుండా ఆర్జేడీలో చేరిపోయారు. ఇలా భాజపా కంటే ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనుక సీఎం నీతీశ్ కుమార్ హస్తం ఉంది’ అని ఎల్జేపీ (రాంవిలాస్) నేత చిరాగ్ పాసవాన్ ఆరోపించారు. కూటమిని విచ్ఛిన్నం చేసుకునేందుకే ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని.. ఇందుకు ‘శిందే’ వంటి రెబల్ నేత కోసం ఎదురుచూస్తున్నాయని ఆరోపించారు.
ఇదిలాఉంటే, 2020 ఎన్నికల వరకు ఎన్డీఏ కూటమిలోనే కొనసాగిన ఎల్జేపీ.. నీతీశ్ కుమార్ తీరును వ్యతిరేకిస్తూ బయటకు వచ్చింది. అయితే, ఎల్జేపీ (రాంవిలాస్) పేరుతో సొంతగూటిని ఏర్పరచుకున్న చిరాగ్ పాసవాన్.. మళ్లీ భాజపాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల సమయానికి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మజ్లిస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల అధికార కూటమిలో కాకుండా ఆర్జేడీలో చేరడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన ఆయన.. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వ్యవహారం వల్లే వారు ప్రతిపక్షపార్టీలో చేరారని అన్నారు. భాజపా ప్రాబల్యాన్ని తగ్గించేందుకే నీతీశ్ ప్రయత్నిస్తున్నారని చిరాగ్ పాసవాన్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్లో చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు. -
ప్రజాగళం విజయవంతంతోసర్దుకుంటున్న జగన్ సర్కారు
చిలకలూరిపేటలో ఎన్డీఏ సభ (ప్రజాగళం) విజయవంతం కావడంతో జగన్ ప్రభుత్వం తట్టాబుట్టా సర్దుకునే పనిలో నిమగ్నమైందని భాజపా అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
వైకాపాలో చేరిన తెదేపా నేత రామచంద్రరావు
విశాఖపట్నానికి చెందిన తెదేపా నేత గంపల వెంకట రామచంద్రరావు, ఆయన భార్య సంధ్యారాణి వైకాపాలో చేరారు. సోమవారం వారు తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. -
ఆయన మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేశారు
ఇటీవల భాజపాలో చేరిన సీనియర్ నేత అశోక్ చవాన్ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ..‘సోనియాజీ.. వారితో పోరాడే శక్తి నాకు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
-
CM Revanth: ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్రెడ్డి.. ఆదుకుంటామని హామీ