TS News: రాజ‌కీయం కోస‌మే కేంద్రంపై విమ‌ర్శ‌లు: డీకే అరుణ‌

క‌రోనా టీకా ప్ర‌క్రియ‌లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను భాజ‌పా జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ ఖండించారు. క‌రోనా నియంత్ర‌ణ‌, వ్యాక్సినేష‌న్

Published : 07 Jun 2021 14:43 IST

హైద‌రాబాద్‌: క‌రోనా టీకా ప్ర‌క్రియ‌లో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను భాజ‌పా జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ ఖండించారు. క‌రోనా నియంత్ర‌ణ‌, వ్యాక్సినేష‌న్ కోసం రూ.రెండున్న‌ర వేల కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌న్న కేసీఆర్ ప్ర‌భుత్వం ఎక్కడా రూపాయి ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. ప్రైవేటు ఆస్ప‌త్రుల బిల్లుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వ‌లేక‌పోయింద‌ని ఆమె ఆరోపించారు. రాజ‌కీయం కోస‌మే కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు