Eatala: ధర్నాచౌక్ని ఎత్తేసిన కేసీఆర్కు సీపీఐ మద్దతా?.. సిగ్గుచేటు: ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో అంటకాగేవారిని, పొత్తు పొట్టుకొనే వారిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల...
మునుగోడు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో అంటకాగేవారిని, పొత్తు పొట్టుకొనే వారిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి సిద్ధంగా లేరని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మునుగోడులో భాజపా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని.. ధర్నాచౌక్ను ఎత్తేసిన కేసీఆర్కు లెఫ్ట్ మద్దతా? అని ప్రశ్నించారు. తెరాసతో పొత్తు ప్రకటించిన సీపీఐ నేతల వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘సీపీఐ, సీపీఎం నేతల్లారా.. ఎనిమిదేళ్లుగా మీరు ఏనాడైనా ప్రగతిభవన్లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసిన సందర్భంగా మిమ్మల్ని చర్చలకు పిలిచి సీఎం సమస్యలను పరిష్కరించారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు అడ్డా ఇందిరాపార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్.. ఈరోజు మీకు ప్రగతికాముకుడిగా కనబడుతున్నారా? సీఎం తమ సమస్యల్ని పరిష్కరిస్తారని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేరని కేసీఆర్ అన్నారు. దీంతో అనేకమంది డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమై.. చివరికి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోం అంటూ మోకాళ్లపై దండంపెట్టి వేడుకున్న చరిత్రను మరిచిపోయారా కమ్యూనిస్టు నేతల్లారా? మున్సిపల్ కార్మికులు సమ్మెచేసినప్పుడు 1700 మందిని ఒక్క కలంపోటుతో తీసేసిన రోజు వారి పక్షాన నేను నిలబడ్డా. తెలంగాణ వచ్చాక మీ పేపర్లో ప్రజల పక్షాన వార్తలు రాస్తే దాన్ని కూడా తన చేతుల్లోకి తీసుకుని మీ కళ్లల్లో మట్టికొట్టిన కేసీఆర్.. మీకు ప్రగతిసారథిగా కనబడుతున్నారా? ఇలా ఒకటికాదు, రెండు కాదు.. వందల సమస్యలపై మీరు సమ్మెలు చేస్తే కనీసం మిమ్మల్ని ప్రగతిభవన్కు పిలిచి అడిగిన పాపాన పోని కేసీఆర్ మీకు మంచివాడిలా కనబడుతున్నారా? పోడు రైతులకు పట్టాలిచ్చే దమ్ము మీకు ఉందా?’’ అని ప్రశ్నించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ విద్యా వాలంటీర్లను ఇప్పటివరకు రెన్యువల్ చేయలేదని మండిపడ్డారు. వేలాది మంది వీఆర్వోలను తొలగించి వారి పొట్టకొట్టారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు రుణాలు దొరకడంలేదు. పోడుభూముల సమస్యలు అలాగే ఉన్నాయి. భాజపా వస్తే మీటర్లు వస్తాయని ఎన్ని ఫ్లెక్సీలు కట్టినా.. హోర్డింగ్లు పెట్టినా.. స్తంబాలపై స్టిక్కర్లు అతికించినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతూనే ఉన్నా పాడిన పాటే పాడుతున్నారన్నారు. హుజూరాబాద్లో ఏం జరిగిందో మునుగోడులోనూ అదేజరుగుతుందన్నారు. నల్గొండ జిల్లా చైతన్యానికి మారుపేరు, అన్యాయానికి, అక్రమాలకు, దుర్మార్గానికి వ్యతిరేకంగా పరుగెత్తి కొట్లాడే జిల్లా అన్నారు. తెలంగాణలో తెరాస పాలన పోవాలని ప్రజలు తపనపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకే భాజపాలో చేరుతున్నారన్నారు. ఆయన్ను నిండుమనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది. -
ఆ మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులకు ఓట్లేయొద్దు
లోక్సభ ఎన్నికల్లో తమ వర్గానికి భాజపా టికెట్లు ఇవ్వకపోవడంపై ఉత్తర్ప్రదేశ్లోని రాజ్పూత్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.