Munugode By poll: కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉప ఎన్నిక: ఎస్‌ఈసీకి భాజపా వినతి

మునుగోడు ఉప ఎన్నిక సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను భాజపా ప్రతినిధుల బృందం కోరింది.

Published : 05 Oct 2022 02:02 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక సక్రమంగా నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర  ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను భాజపా ప్రతినిధుల బృందం కోరింది. హైదరాబాద్‌ బుద్ధభవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని భాజపా ప్రతినిధులు నల్లు ఇంద్రసేనారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, ప్రకాశ్‌రెడ్డి, ఆంటోని రెడ్డి కలిసి  ఈమేరకు వినతిపత్రం అందజేశారు. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని తెరాస ప్రయత్నిస్తోందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.  భాజపాలో చేరిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని నివేదించినట్టు చెప్పారు. గతంలో అంబులెన్స్‌లు, పోలీసు వాహనాల ద్వారా డబ్బులు సరఫరా చేశారని ఆరోపించారు. నగదు సరఫరా చేసే వాహనాలను పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని  కోరినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా బాధ్యత వహించాలని కోరినట్టు పేర్కొన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వికాస్‌రాజ్‌ .. సప్లిమెంటరీ ఓటరు జాబితా ఈనెల 8న ఇస్తామని చెప్పారని ఇంద్రసేనారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని