Andhrapradesh news: అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిపోతోంది: భాజపా

ఆంధ్రప్రదేశ్‌ కాస్త అరాచకప్రదేశ్‌గా మారిందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై తిరుపతిలో భాజపా నేతలు నిరసనకు దిగారు.

Published : 06 May 2022 02:08 IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌ కాస్త అరాచకప్రదేశ్‌గా మారిందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై తిరుపతిలో భాజపా నేతలు నిరసనకు దిగారు. భానుప్రకాశ్ రెడ్డి ఇంటి నుంచి అలిపిరి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుడా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అయినా ముఖ్యమంత్రి, హోం మంత్రి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయిని తెలిపారు. రాష్ట్రంలో ఈ వరుస అఘాయిత్యాలకు ప్రధానంగా మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడి అమ్మకాలే  కారణమవుతున్నారు. వీటిని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ధ్వజమెత్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని